Karthi Khaidi 2 Movie : ఖైదీ.. 2019 లో రిలీజ్ అయిన ఈ సినిమాతో లోకేష్ కనకరాజ్ పేరు ఒక్కసారిగా మారు మోగిపోయింది. కార్తి హీరోగా నటించిన సినిమా ఎంత హిట్ అయిందో మళ్లీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లోనే దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా హీరో కార్తీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. కార్తి హీరోగా నటించిన జపాన్ సినిమా త్వరలోనే విడుదల పోతుంది.
ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కార్తీ మాట్లాడుతూ ఖైదీ 2 సినిమా లోకేష్ కనకరాజ్ మనసులో ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లో ఆ సినిమా రాబోతుంది. ఇంకా స్క్రిప్ట్ అయితే కంప్లీట్ కాలేదు. లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తన తర్వాత సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఖైదీ 2 సినిమాను మొదలుపెడతారు అంటూ కార్తీ చెప్పారు.
అలాగే లియో ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కూడా ఖైదీ2 కి అంత రెడీ గానే ఉన్నట్లు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూస్తుంటే హీరో.. దర్శకుడు.. ఇద్దరు కూడా తమకు భారీ హిట్ ఇచ్చిన సినిమా కు సీక్వెల్ తీయాలని ప్లాన్ లోనే ఉన్నారు. సో ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.