Ram Charan : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న రెబల్ స్టార్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేయగా.. ఇందులో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా.. ఫస్ట్ డే నుంచే ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆదిపురుష్ హవా నడుస్తుంది.
ఇదిలావుండగా ఈ మూవీ టాపిక్ లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పేరు కూడా రామాయణం విషయంలో వైరల్ గా మారింది. రామాయణానికి రామ్ చరణ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అంతా భావిస్తున్నారు. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ రాముడి పాత్ర కాగా సీత పాత్రల్లో సాయి పల్లవి చేయనుందని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ డైరెక్ట్ చేయనున్నాడని ఓ అనూహ్యమైన న్యూస్ వైరల్ గా మారింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబినేషన్ గురించే చర్చ. రాముడిగా చరణ్, సీతగా సాయి పల్లవి.. అబ్బా… ఆ ఊహే ఎంత బాగుందో అంటూ ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. ప్రస్తుతం చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ లో నటిస్తుండగా కియారా అద్వానీ హీరోయిన్ కాగా అంజలి ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇక సాయి పల్లవి తాజాగా ఓ కోలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.