Oscars 2023 : ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భారతీయుల హవా కొనసాగుతోంది. ఆస్కార్ వేదిక మీద చీరకట్టుతో మన వనితలు అవార్డు అందుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ అవార్డ్ వరించింది. ది ఎలిఫెంట్ విష్పరర్స్ ఆస్కార్ అవార్డు గెలుచుకుని.. దేశం గర్వ పడేలా చేసింది.
ఈ డాక్యుమెంటరీని కార్తికీ గాన్స్లేవ్స్ తెరకెక్కించగా, గునీత్ మోంగా నిర్మించారు. గునీత్.. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా ఎర్ర రంగు చీరకట్టులో ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఇక అవార్డు తీసుకున్న అనంతరం కార్తీకి మాట్లాడుతూ.. ఆస్కార్ ను మదర్ ల్యాండ్ ఇండియాకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.
కుట్టునాయకన్ అనే గిరిజన ఫ్యామిలీలో కలిసి పెరిగిన ఏనుగు కథ ఇది. ఐదేళ్ల పాటు ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సాగింది. ఏనుగులు, వాటి సంరక్షకుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ డాక్యుమెంటరీలో చాలా గొప్పగా చూపించారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది.
'The Elephant Whisperers' wins the Oscar for Best Documentary Short Film. Congratulations! #Oscars #Oscars95 pic.twitter.com/WeiVWd3yM6
— The Academy (@TheAcademy) March 13, 2023