Keerthy Suresh : రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. మొదటి మూవీతోనే హిట్ కొట్టిన కీర్తి అనంతరం తెలుగులో నాని సరసన నేను లోకల్ లో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి అజ్ఞాతవాసిలో నటించింది, అది డిజాస్టర్ అయినా ఆ తర్వాత కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది.
దీంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయింది కీర్తి. మహానటి2 తర్వాత ప్రొడ్యూసర్ కీర్తితో మూవీస్ చేయడానికి క్యూ కట్టారు. అయితే కీర్తి సురేష్ చేసిన హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు అన్నీ ప్లాప్ అయ్యాయి. దీంతో కీర్తికి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. ఆ మధ్య మహేష్ బాబుతో కలిసి నటించిన సర్కారు వారి పాట మూవీ హిట్ అయినప్పటికీ హీరోయిన్ గా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు.
అంతేకాదు మోడ్రన్ గర్ల్ గా కనిపించడంతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా వచ్చిన దసరా మూవీతో కీర్తి ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దసరాలో వెన్నెల పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో కీ రోల్ పోషించింది, డీ గ్లామర్ రోల్ లో వెన్నెల పాత్రకు కీర్తి జీవం పోసిందని చెప్పవచ్చు. ధూమ్ ధామ్ సాంగ్ లో కీర్తి డాన్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి.
ఓవరాల్ గా కీర్తి టాలీవుడ్ లో మళ్లీ పుంజుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ లో నటిస్తుంది. ఇది కూడా హిట్ అయితే.. కీర్తికి మరింత ప్లస్ అవుతుంది. చూడాలి ఏం జరుగుతుందో.. ఇక ముందు కీర్తి ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటుందో..
Discussion about this post