Ram Pothineni Puri Jagannadh Movie : టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్, మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పూరీ జగన్నాథ్. యావరేజ్ హీరో కూడా పూరీ చేతిలో పడితే ఆటం బాంబ్ లా మారిపోతాడు. సిల్వర్ స్క్రీన్ పై డైరెక్టర్ పేరు పడితే విజిల్స్ పడేవాళ్లల్లో ముందు వరుసలో ఉంటాడు పూరీ. హీరోకి ఏ మాత్రం తగ్గని కట్ అవుట్లు థియేటర్ల ముందు దర్శనిమిస్తాయి. అయితే ఆ మధ్య సరైన హిట్లు లేని పూరీ జగన్నాథ్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో కం బ్యాక్ అయ్యాడు.
అయితే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన పాన్ మూవీ లైగర్ ఫ్లాప్తో మరోసారి పూరీ జగన్నాథ్ కష్టాల్లో పడిన విషయం తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ మూవీతో తిరిగి కెరీర్ను గాడిన పెట్టుకున్నాడు. అదే జోష్తో లైగర్ చిత్రాన్ని అంత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తెరకెక్కించాడు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం బ్లాక్బస్టర్ అవుతుందని ఆశపడ్డ మూవీ టీం అంచనాలన్నీ తలకిందులయ్యాయి.
లైగర్ తో కాస్త ఢీలా పడ్డ పూరీ జగన్నాథ్ అండ్ ఛార్మీ.. ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ట్రయో పూరీ జగన్నాథ్, ఛార్మి, అండ్ రామ్ పోతినేని.. మళ్లీ కలవబోతున్నారు. దీంతో ఈ ట్రయోపై మంచి బజ్ ఏర్పడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం తెగ వైరల్ అవుతుంది. అయితే వీరి కాంబోలో తెరకెక్కనున్న మూవీ ఇస్మార్ట్ మూవీకి సీక్వెల్గా వస్తోందా.. లేక కొత్త కథతో వస్తుందా అన్నది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.
Discussion about this post