Samantha : స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఈ చిత్రంలో సమంతకు జోడీగా దేవ్ మోహన్ నటించాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను నీలిమ గుణ, దిల్ రాజు కలిసి నిర్మించారు.
భారీ ఏప్రిల్ 14న శాకుంతలం మూవీ రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజే నెగిటివ్ టాక్ రావడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. దాంతో సినిమా నిర్మాతలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. రూ.65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన శాకుంతలం..
ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. థియేటర్స్కు వచ్చే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఈ చిత్రం వారం కూడా గడవక ముందే డిజాస్టర్ అని తేలిపోయింది. దీంతో సమంత ఈ మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసినట్టు సమాచారం. నిర్మాత నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని సామ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రెస్రెంట్ సామ్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఖుషి మూవీలో నటిస్తుంది.
Discussion about this post