Janasena : తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో వానపల్లిగూడెం సంబంధించిన యువత భారీ సంఖ్యలో చేరికయ్యారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, నచ్చి పార్టీలో పని చేయాలని కోరికతో యువత జనసేన పార్టీలో చేరినట్టు తెలిపారు. అలాగే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవ కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరుతున్నామని యువత అన్నారు.
ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెం పట్టణ 2, 3, 4 వార్డులలో వానపల్లిగూడెం యువతను 100 మందికి పైగా జనసేన పార్టీ కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. యువత యొక్క కు బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తామని అన్నారు.
ఇప్పుడున్న తాడేపల్లిగూడెం నేత ఎంతసేపు వారికోసం, వారి బిడ్డల కోసం ఆలోచిస్తున్నారు. తప్ప మీకోసం ఆలోచించడంలేదని యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అలాగే యువత కులాలకు, మతాలకు అతీతంగా అండగా నిలబడితే జనసేన అధికారంలోకి రావడం తద్యం అని అన్నారు.
రానున్న రోజుల్లో అన్ని కులాల ఐక్యత సాగాలని, అది జనసేనతోనే సాధ్యం అని ఆయన యువతతో చెప్పారు. అంతేకాకుండా ఈరోజు భీమవరంలో జరిగిన సంఘటనలో నాయకులను మరియు జనసైనికులను అక్రమ అరెస్టులను ఖండిస్తూ రాజ్యాంగానికి చట్టాలకు లోబడి మేం ముందుకు సాగుతామని మా పార్టీ విధానం కూడా అదే అని
అబద్ధపు కేసులు, అక్రమ కేసులు ప్రజా పోరాటాలను ఆపలేవని ఆయన స్పష్టం చేసారు. ప్రజలను పాలించాలని జగన్ రెడ్డికి అధికారం ఇచ్చారు గానీ, వారి పార్టీ అక్రమాలకు అడ్డు చెప్పిన వారిని అణిచివేయడానికి కాదని, భవిష్యత్తులో ఎవరిది నిజమైన పోరాటమో, ప్రజలు ఎవరి వైపు ఉన్నారో తెలుస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ వెల్లడించారు.