Health Tips : ప్రతిరోజు మన దయనందన జీవితంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఆహారంలో ఏ చిన్న లోటుపాట్లు జరిగిన దాని ప్రభావం మన ఆరోగ్యం పై పడి సమస్యలకు దారి తీస్తుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
జంక్ ఫుడ్ లాంటి ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. ఈ ఫుడ్డు ప్రేగులకు అతుక్కుపోయి జీర్ణ వ్యవస్థను మందగించేలా చేస్తుంది. శరీరంలోని మలినాలను తొలగించడంలో నీరు ప్రధాన పాత్రను పోషిస్తుంది. మీరు ఎక్కువగా నీరు తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయినటువంటి మలినాలు బయటకు పోతాయి.
వాటి ద్వారా మూత్రపిండాలు శుభ్రపడతాయి. రక్తంలో ఉండే మలినాలు తొలగిపోవాలంటే ప్రతిరోజు 8 నుండి 10 గ్లాసుల నీరు ఖచ్చితంగా త్రాగాలి. లేకపోతే శరీరంలో మలినాలు పేరుకుపోయి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ధూమపానం చేసే వారిలో మలినాలు శరీరంలో ఎక్కువగా పేరుకుపోతూ ఉంటాయి. అలాంటి వారికి కూడా నీరు ఔషధంగా పనిచేస్తుంది.
అన్నింటికంటే ప్రధానమైనది ప్రతిరోజు వ్యాయామం అలవాటు చేసుకోవడం. వ్యాయామం వల్ల శరీరంలో మలినాలు సులభంగా తొలగిపోవడమే కాక ,జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. వ్యాయామానికి ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకోవాలి. దాదాపు 20 నుండి 30 నిమిషాల వరకు వ్యాయామాన్ని చేసినట్లయితే శరీరానికి చెమట పట్టి చెమట
రూపంలో మలినాలు బయటకి విసర్జింపబడతాయి. దీనితోపాటు గ్లాస్ నిమ్మకాయ నీటిని కూడా ప్రతిరోజు ఖచ్చితంగా తాగాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి శరీరంలో ఉండే వ్యర్ధాలను బయటకు పంపించడంలో ముఖ్య భూమిక పోషిస్తుంది. నిమ్మకాయ నీరు రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీర బరువును తగ్గించడంలో కూడా సహాయం చేస్తుంది.