Indian Passport Color : విదేశాలకు వెళ్లాలన్న, వేరే దేశంలో గుర్తింపు పొందాలన్నా కూడా పాస్ పోర్ట్ చాలా కీలకమైందని మనకు తెలుసు. అలాంటి పాస్ పోర్ట్ భారతదేశంలో మూడు రంగులలో ఉంటుందని మీకు తెలుసా.. దీని వెనుక గల కారణం మీరు ఎప్పుడైనా గమనించారా.. అయితే భారత దేశంలో పాస్ పోర్ట్ నీలం రంగులో ఉంటుందని చాలామందికి తెలుసు. కానీ ఆ ఒక్క రంగులోనే కాకుండా మరికొన్ని రంగులలో కూడా భారతదేశంలో పాస్ పోర్ట్ లభ్యం అవుతుంది. ఇలా ఉండడం వల్ల ఒక నిర్దిష్ట గుర్తింపుని హైలెట్ చేయడం జరుగుతుంది.
భారతదేశంలో మొత్తంగా మూడు రంగుల పాస్ పోర్ట్ లు అందుబాటులో ఉంటాయి. అవి తెలుపు, నీలం,మెరున్ రంగులలో మనకు కనిపిస్తాయి. నీలం రంగు పాస్ పోర్ట్ ను సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం జారీ చేస్తుంది. దీనితో వారు విదేశాలకు ప్రయాణం చేసుకోవచ్చును. అలాగే ఉద్యోగం, ఆరోగ్యం, విద్య కోసం లేక ఇతర ఏ పనికైనా పాస్ పోర్ట్ లపై అనుమతి వీరు పొందవచ్చు.
ఇక తెలుగురంగు పాస్ పోర్ట్ విషయానికి వస్తే.. ఇది ప్రభుత్వానికి సంబంధించినది. ఏదైనా పని కోసం విదేశాలకు వెళ్లే వ్యక్తులకు దీనిని జారీ చేస్తారు. ఈ పాస్ పోర్ట్ పై ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఈ పాస్ పోర్ట్ కలిగి ఉన్నవారు ప్రభుత్వ అధికారి అని అర్థం.
ఇక మెరూన్ కలర్ పాస్ పోర్ట్ సీనియర్ అధికారులకు, దౌత్యవేత్తలకు జారీ చేస్తారు. ఈ పాస్ పోర్ట్ ఉన్నవారు విదేశాలకు వెళ్లేందుకు వీసా అవసరం లేదు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ కూడా సులభంగా ఉంటుంది.
అయితే పాస్ పోర్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వల్ల పొందవచ్చు. దీనికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ తేదీ పూర్తవ్వగానే మళ్లీ పాస్ పోర్ట్ ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.