Janasena in Krishna District : జనసేన ఆధ్వర్యంలో చేపట్టిన జగనన్న కాలనీల సంరక్షణ ఆంధ్ర జిల్లాలో విస్తృతంగా జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా జనసేన శ్రేణులు కాలనీల దర్శనాలు చేశారు. అక్కడి పరిస్థితులను వారు చూపించారు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన శ్రేణుల జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం ఉద్రిక్తతల నడుమ సాగింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడవ నియోజకవర్గం కేంద్రంలో పైడమ్మ తల్లి కాలనీకి సమీపంలో
జగనన్న కాలనీ సందర్శనకు వెళ్లిన యడ్లపల్లి రామ్ సుధీర్, ఇతర నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. జగనన్న కాలనీలు సాక్షిగా మంత్రి జోగి రమేష్ అక్రమాలు బయటపడతాయనే తమను అక్రమంగా అరెస్టు చేయించినట్టు ఈ సందర్భంగా పార్టీ నాయకులు మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన శ్రేణులు జగనన్న కాలనీల మోసాన్ని బట్టబయలు చేశాయి.

ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పెనమలూరు, గన్నవరం, పెడన, అవనిగడ్డ తదితర నియోజకవర్గాల పరిధిలో స్థానిక పార్టీ నాయకులతో కలసి జగనన్న కాలనీలు సందర్శించారు. తాను సందర్శించిన అన్ని కాలనీల్లోనూ మోకాల్లోతు నీరు నిలిచి ఉండడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మచిలీపట్నం నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని కరగ్రహారం జగనన్న కాలనీని ఆ నియోజకవర్గ ఇంఛార్జ్ పై బండి రామకృష్ణ పడవలో వెళ్లి సందర్శించాల్సి వచ్చింది.
అది నీటి సరస్సా, జగనన్న కాలనీనా అధికార పార్టీ నాయకులే చెప్పాలని డిమాండ్ చేశారు. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో తాడిశెట్టి నరేష్, శ్రీ బూరగడ్డ శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో అన్ని మండలాల పరిధిలో జగనన్న కాలనీల దుస్థితిని పార్టీ శ్రేణులు ఎండగట్టాయి. విజయవాడ పట్టణ వాసుల కోసం ఇబ్రహీంపట్నం వద్ద జగన్న కాలనీని పార్టీ అధికార ప్రతినిది పోతిన మహేష్ సందర్శించి వైసీపీ మోసాన్ని ఎండగట్టారు.

పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు గన్నవరం నియోజకవర్గం వణుకూరు. లేఅవుట్ దుస్ధితిని కళ్లకు కట్టారు. మైలవరం నియోజకవర్గంలో అండార్డ్ అక్కల రామ్మోహన రావు, నూజివీడు నియోజకవర్గంలో బర్మా ఫణిబాబు, మరీదు శివరామకృష్ణల ఆధ్వర్యంలో నాలుగు మండలాల పరిధిలో జగనన్న లేఅవుట్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు.
