Gaddar : ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం అని జనసేన పార్టీ నుంచి గద్దర్ కి నివాళులు అర్పించారు. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
ఈ మధ్యకాలంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరిన ప్రజానాయకుడు గద్దర్ నీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించిన విషయం విధితమే. పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ గారికి చాలా మంచి సాన్నిహిత్యం ఉండేది. గద్దర్ నీ కలిసిన సందర్భంగా రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారికి ఆయన సూచనలు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో ఎలా నిలదొక్కుకోవాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి.

అనే విషయాలపైన పవన్ కళ్యాణ్, గద్దర్ ఇద్దరు ముచ్చటించారు. పవన్ కళ్యాణ్ తో మాట్లాడినా గద్దర్ ఆ కొద్ది సమయంలోను యువత గురించి ఆందోళన చెందినట్లు తెలిసింది. యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని వారి నిరుద్యోగ సమస్యను పోగొట్టాలని ఆయన పవన్ కళ్యాణ్ గారికి సూచించినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇంతలోనే గద్దర్ అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించిందని జనసేన పార్టీ ప్రకటించింది.
