అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ రథం దగ్ధమైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడం మంచి పరిణామమని విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర అన్నారు. సీబీఐ విచారణ చేస్తే అసలు దోషులెవరో తేలుతుందని, దీని వెనక ఎవరి కుట్ర ఉందనేది బయటపడుతుందని అని వ్యాఖ్యానించారు.
ఆయన వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన నాయకుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఘటన జరిగినప్పటి నుండి కనీస స్పందన లేని ఆయన సీబీఐ విచారణ కోసం వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని, రాష్ట్రంలో హిందూ ఆలయాలపై ఎన్నో దాడులు జరుగుతుంటే వాటిపై ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు సంధించారు. ఈ ప్రభుత్వంలో ఆయన కూడా ఒక భాగమే అని, భక్తుల మనోభావాలతో ఆడుకునే ఇటువంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎద్దేవా చేశారు
