• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

వాళ్ల ప్రాణానికే ప్రమాదం.. తక్షణం సమస్యను పరిష్కరించండి..

TrendAndhra by TrendAndhra
September 26, 2020
in Latest News
0 0
0
Spread the love

ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలకు భూములిచ్చిన రైతులకు పరిస్థితి అగమ్యగోచరమే.. ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకునే ప్రభుత్వాలు నిర్వాసితులకు పరిహారం విషయంలో ప్రతిసారి తన అధికారాన్ని ఉపయోగించి వారి నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప న్యాయం చేయడం లేదు.

తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ల ప్రొద్దుటూరు గ్రామస్తులు వరద నీటిలో గడుపుతూ తమను కాపాడమని చేసిన విజ్ఞప్తిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తక్షణమే వారిని కాపాడడానికి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

తమ కాలనీలోకి రిజర్వాయర్ నీరు వస్తుందని, తమను కాపాడాలని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు చేసిన విజ్ఞప్తిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన ఈ విషయంపై స్థానిక నాయకులను క్షేత్రస్థాయికి పరిశీలనకు పంపారు. స్థానిక నాయకుల నివేదిక అనంతరం పవన్ కళ్యాణ్ ఈ విషయం పై స్పందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కాలనీ వాసుల పరిస్థితి దయనీయంగా ఉందని, వారికి పరిహారం అందని కారణంగా వారు అక్కడే నివాసం ఉంటున్నారని, వేరే చోట నివాసం ఏర్పరచుకునే స్తోమత వారికి లేదని, వృద్ధులు మహిళలు చిన్నపిల్లలతో ముంచుకొస్తున్న వరదనీటి మధ్యన భయం భయం గా గడుపుతున్నారని అయన లేఖలో పేర్కొన్నారు.

రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం లో నీరు విడుదల చేస్తే వారి ప్రాణాలకే ప్రమాదం అని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తాళ్ల పొద్దుటూరు నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అధికారులు నిర్వాసితులతో తక్షణం సంప్రదింపులు జరిపి తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.


Spread the love
Tags: JanasenaPawan Kalyan DemandsThalla Proddutur
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.