టాలీవుడ్ ప్రముఖ నటుడు, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి మనకు తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అంశాలపై స్పందిస్తూ.. ట్వీట్లు, పోస్టులు పెడుతుంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా దేవుడు అంటూ ఆయనపై పెట్టిన పోస్టులతో బండ్ల ఎప్పుడూ హైలెట్ అవుతుంటాడు. బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా దీపావళి సందర్భంగా బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
తాను కొన్న దీపావళి టపాసులను ఇంటి ముందు పేర్చి కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు. సదరు ఫోటో ట్వీట్ చేసిన బండ్ల గణేష్ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద మొత్తంలో ఉన్న బాణాసంచా చూసిన జనాలు షాక్ అవుతున్నారు. ఇన్ని టపాసులు మీ కుటుంబం కోసమేనా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బండ్ల గణేష్ కొన్న ఆ టపాసుల విలువ దాదాపు రూ. 4 లక్షలు!
అయితే ఆయన కొనుగోలు చేసిన ఈ పటాసులు మొత్తం తమ కుటుంబం కోసం కాదట. వాటిలో కొన్ని సన్నిహితులకు, చుట్టుపక్కల జనాలకు పంచుతారని సమాచారం. ప్రతి ఏడాది బండ్ల గణేష్ ఇలానే భారీగా బాణా సంచా కొనుగోలు చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ చేస్తున్నారు. దీపావళి వేడుకల కోసం భారీగా బాణాసంచా కొనుగోలు చేసిన బండ్లను నువ్వు తోపు అన్నా అంటూ కొనియాడుతున్నారు.