టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిన్న ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 60 ఏళ్ల సినీ జీవితంలో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ పాత్రల్లో దాదాపు 750కి పైగా చిత్రాల్లో సత్యనారాయణ నటించారు. కైకాల చేసిన వైవిధ్యమైన పాత్రలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
యముడు అంటే.. కైకాల సత్యనారాయణే అనేలా చేసింది. 200 మంది పైచిలుకు దర్శకుల డైరెక్షన్లో.. సుమారు 700 వందలకు పైగా చిత్రాల్లో నటించి.. ప్రజలను మెప్పించిన కైకాల సత్యనారాయణకి ఒక బలమైన కోరిక ఉండేది. కానీ అది తీరకుండానే కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మల్టీస్టారర్ చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు.. చివరిగా మరో మల్టీస్టారర్ చేయాలనీ కోరిక బలంగా ఉండేదట.
Also Read: రెండు కంటే ఎక్కువ సిమ్స్ వాడితే ఏం జరుగుతుందో తెలుసా..!?
ముఖ్యంగా ఇండస్ట్రీ దిగ్గజాలైన చిరంజీవి, బాలకృష్ణలు కలిసి చేస్తే ఆ స్టారర్ లో మంచిపాత్ర చేయాలనీ అడిగేవారట. చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఎన్నోసార్లు తన కోరికని బయటపెట్టాడట. కానీ ఈ కాంబినేషన్ లో నటించకుండానే చనిపోయారు కైకాల. ఇక తాజాగా మొన్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల RRR చిత్రాన్ని చూసి చాలా సంతోషించారట. ఈ కాంబినేషన్ లానే చిరు, బాలయ్యలు కలిసి నటిస్తే బాగుంటుంది అంటూ అనేవారట కైకాల సత్యనారాయణ.