Garuda Purana : పుట్టిన మనిషి గిట్టక తప్పదు. మనిషి ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ, మరణం తర్వాత ఏం జరుగుతుంది. మరణం సంభవించే ముందు మన కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది, అనే విషయం మాత్రం కనిపెట్టలేకపోయాడు. కానీ గరుడ పురాణంలో మనిషి యొక్క మరణం వెనుక దాగిన రహస్యాలు లిఖించబడి ఉన్నాయి.
జీవించినప్పుడు మనిషి చేసే పాప, పుణ్యాలను బట్టి శిక్ష ఉంటుందని గరుడ పురాణంలో ఉంది. ఒకసారి గరుడు సమస్త జీవుల మరణం, నరకం, మోక్షం, యమలోక ప్రయాణం, ఆధ్యాత్మిక గురించి తెలుసుకోవడానికి విష్ణువుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ప్రతి ఒక్క ప్రశ్నకి విష్ణు మహాదేవుడు సృష్టి రహస్యాలను విడమర్చి గరుడికి బోధిస్తాడు.
గరుడు అడిగే ప్రశ్నల యొక్క పరంపర విష్ణుమూర్తి ఇచ్చే సమాధానాల యొక్క అల్లికనే ఈ గరుడ పురాణం. ఈ గరుడ పురాణంలో మనిషి యొక్క జనన,మరణాలు లిఖించబడి ఉంటాయి. ఈ గరుడ పురాణాన్ని చనిపోయిన వారి ముందు పఠిస్తారు. అయితే మృత్యువు తనకు దగ్గరగా వస్తున్నప్పుడు ఒక మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడు. అతని కళ్ళ ముందు ఏం కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.
మృత్యువు సంభవించే ముందు అతను తన ముక్కు వైపు చూడలేదు. కలలో వింత సంఘటనలు, వింత ఆలోచనలు వస్తూ ఉంటాయి, కొంతమంది ఆ కలలో వచ్చిన ఆలోచనలే ఉదయం లేవగానే నిజంగా జరుగుతున్నట్లు భ్రమ పడుతూ ఉంటారు. అతని చేతిలోని చేతి గీతలు కూడా అతనికి కనిపించవు. ఎదురుగా నీరు ఉంటే అందులో అతని చిత్రం సరిగా కనిపించదు.
ఇంకో విచిత్రమైన విషయం ఏమిటంటే.. చనిపోయిన మన పూర్వీకులు, మన కళ్ళ ముందు మనల్ని రమ్మని పిలుస్తున్నట్టు కనిపిస్తుంది.