Intresting Fact about Kakan Madh Temple : కొన్ని ఆలయాలు ఎంత అద్భుతంగా కనిపిస్తాయో, అంతే ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అంత చిక్కని ఎన్నో ప్రశ్నలను మన మీదకు సంధిస్తాయి. అలాంటి జాబితాలోకి వచ్చేదే “కాకన్ మధ్” ఆలయం. శాస్త్రవేత్తలు సైతం ఈ ఆలయం యొక్క రహస్యాలను కనిపెట్టలేకపోయారు. ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని ముట్టుకోవాలంటే జంకుతారు. మరి అలాంటి ఆశ్చర్యాన్ని గొలిపే ఆలయం ఎక్కడ ఉంది..? దాని చరిత్ర ఏమిటి..? తెలుసుకుందాం.
కాకన్ మధ్ ఆలయం మధ్యప్రదేశ్ లో ఉంది. ఇప్పటికీ ఈ ఆలయం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఈ గుడి మొత్తాన్ని రాళ్లతో మాత్రమే నిర్మించారు. మనకు తెలిసినంతవరకు సాధారణంగా రాళ్లతో చాలా ఆలయాలే ఉన్నాయి. కానీ ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. రాళ్ల మధ్యలో ఎటువంటి లైన్ కానీ, సిమెంట్ కానీ, మట్టి కానీ ఉపయోగించకుండా, అలాగే మనుషుల సహాయం లేకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
ఒక రాయి మీద మరో రాయిని పేర్చుకుంటూ ఆలయాన్ని పూర్తి చేశారు. కేవలం ఒక్కటంటే ఒక్క రాత్రిలోనే ఆలయాన్ని నిర్మించడం గమనార్హం. ఇక్కడ మరో వింత ఏమిటంటే ఈ ఆలయం చుట్టూ నిర్మించిన మిగతా ఆలయాలన్నీ ఎప్పుడో శిథిలావస్థకి చేరిపోయాయి. కానీ ఇప్పటికి కూడా ఈ ఆలయం చెక్కుచెదరకుండా అలాగే ఉంది. శాస్త్రవేత్తల పరిశోధనా బృందం చుట్టూ ఉన్న ఆలయాలను పరిశోధించే క్రమంలో ఈ ఆలయం దగ్గరికి కూడా వెళ్లారు.
కానీ ఈ ఆలయాన్ని ముట్టుకోవడానికి మాత్రం వారు సాహసం చేయలేకపోయారు. ఇంకా అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. ఈ ఆలయా నిర్మాణంలో వాడినటువంటి రాళ్లు మధ్యప్రదేశ్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఆలయ నిర్మాణం కోసం వాడిన రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన విషయాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. ప్రపంచంలోనే అందరిని ఎంతో ఆశ్చర్య చకితుల్ని చేస్తున్న ఈ ఆలయం మిస్టరీ ఇప్పటికీ కూడా వీడలేదు. ఇకముందు కూడా వీడుతుందన్న నమ్మకం కూడా లేదు.