SriRama Navami 2023 : శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించి తరిస్తారు భక్తులు. తమ జీవితాల్లో ఉన్న కష్టాలను తొలగించి సరైన మార్గాన్ని చూపించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటారు. ఈ శ్రీ రామనవమి త్రేతాయుగం నాటి నుండి జరుపుకుంటున్నారు. అయోధ్య రాజైన దశరధుడికి, రాణి కౌసల్యకు జన్మిస్తాడు రాముడు. వసంత పండుగ చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరామనవమిని జరుపుతారు.
ఇది హిందూ చంద్రామాన క్యాలెండర్ లో మొదటి నెల. దుర్గాదేవిని తొమ్మిది రూపల్లో చైత్ర నవరాత్రుల్లో పూజిస్తారు. రాముడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు ఆ రోజునే భూమిపై అవతరించారు. శ్రీరాముడినీ “మర్యాద పురుషోత్తం” అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ పేరుకు అనేక అర్ధాలు కలవు. “మర్యాద” అంటే “మంచి ప్రవర్తన” అని అర్థం. “పురుషోత్తం” అంటే పురుషులలో “అసమానమైనది” అని అర్థం వస్తుంది.
అంటే.. దాని అర్థం రాముడు తన జీవితమంతా మర్యాదకు కట్టుబడి ఉన్నందున అతను పురుషులందరిలో అత్యుత్తముడిగా ఉన్నాడు అని. శ్రీరాముడు విష్ణుమూర్తి ఏడవ అవతారంగా జన్మించాడు. రాముడు శుక్లపక్షం నవమి తిథి చైత్రమాసంలో మధ్యాహ్న సమయంలో జన్మించాడు. దాని ప్రకారం మార్చి – ఏప్రిల్ లలో వస్తుంది. ఈ సంవత్సరం మార్చి 30న శ్రీరామనవమి వచ్చింది.
శ్రీరాముడు ప్రజల కోసం, వారికి సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పాడు. శ్రీరాముడు ద్వేషం, దురాశలకు, దుర్గుణాలకు దూరంగా ఉన్నాడు. బలహీనులకు రక్షణగా నిలిచాడు. శత్రువు ఎంత బలవంతుడైన ఎదిరించి నిలబడ్డాడు. అందుకే ఇప్పటికి కూడా రామరాజ్యం రావాలని ప్రజలందరూ కోరుకుంటారు. చాలామంది శ్రీరామనవమి రోజు కన్య పూజ చేస్తారు. దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే తొమ్మిది మంది అమ్మాయిలకు పూజిస్తారు.
రాముడి భక్తులందరూ శాంతి,సంపద, విజయం కోసం ఆ రాముని ఆశీస్సులను కోరుకుంటారు. చిన్న రాముడి విగ్రహాలను అలంకరించి, ముందు దీపం వెలిగించి, ఆపై దేవునికి ప్రసాదంగా ఖీర్ తయారు చేసి, రాముడు విగ్రహాలను ఊయలలో వేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే శ్రీరాముడి కళ్యాణం జరుపుతారు. రాముడు జన్మించినది, పట్టాభిషేకం, సీతని వివాహం చేసుకుంది అన్ని నవమి రోజుల్లో రావడం విశేషం..
Discussion about this post