నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం కాబోతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), కెనరా బ్యాంక్ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తుంది.
ఇకపై వినియోగదారులు అవసరమైతే అందించే సేవలకు చెల్లించే నగదును డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు.