Adipurush Pre Release Event : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగు-హిందీలో ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో రాఘవుడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా నటించగా జానకి పాత్రలో
హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. అయితే ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో వేగం పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రభాస్ గత సినిమాల్లా భారీ హంగులతో అయితే ఈ ఈవెంట్ ని కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఈ ఈవెంట్ కి భారీ మొత్తంలో ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.
ఈ గ్రాండ్ ఈవెంట్ కోసం మేకర్స్ సుమారు 2 కోట్లకి పైగానే వెచ్చించినట్టు సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈరోజు సాయంత్రం నుంచి రాత్రికి ఈవెంట్ మైండ్ బ్లోయింగ్ గా ఉండనుంది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి హాజరుకానున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత డార్లింగ్ కి సరైన హిట్ ఇంకా పడలేదు. ఆ లోటును ఆదిపురుష్ తీరుస్తుందేమో చూడాలి.
Discussion about this post