• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Entertainment

Chiranjeevi: అత్తమ్మ చేసిన ఆ పని గురించి చెబుతూ చిరంజీవి ఎమోషనల్.. బన్నీ నానమ్మ ఎంతైనా గ్రేట్ కదా..

Chiranjeevi: అత్తమ్మ చేసిన ఆ పని గురించి చెబుతూ చిరంజీవి ఎమోషనల్..!

Sandhya by Sandhya
August 31, 2025
in Entertainment, Latest News, Movie
0 0
0
Chiranjeevi: అత్తమ్మ చేసిన ఆ పని గురించి చెబుతూ చిరంజీవి ఎమోషనల్.. బన్నీ నానమ్మ ఎంతైనా గ్రేట్ కదా..
Spread the love

Chiranjeevi: అత్తమ్మ చేసిన ఆ పని గురించి చెబుతూ చిరంజీవి ఎమోషనల్..!

 

Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనకరత్నమ్మ ఆగస్టు 30న తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తెల్లవారుజామున 2 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు, మెగా హీరోలు తరలివచ్చారు.

ఈ బాధాకరమైన సమయంలోనూ మెగాస్టార్ చిరంజీవి చూపించిన సామాజిక బాధ్యత అందరినీ కదిలించింది. ఉదయం నుంచి అక్కడే ఉండి అన్ని అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతేకాకుండా, అత్తగారి పాడెను స్వయంగా మోస్తూ అల్లు, మెగా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పారు.

తాజాగా ఒక ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి తన అత్తగారి మరణం తర్వాత తీసుకున్న గొప్ప నిర్ణయం గురించి వివరించారు. “అత్తగారు కన్నుమూశారని తెలిసిన వెంటనే మా బ్లడ్ బ్యాంక్ అధినేత స్వామి నాయుడుకు ఫోన్ చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో నేత్రదానం కోసం ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఈ లోపు నేను అత్తగారికి నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్నాను,” అని తెలిపారు. ఈ సందర్భంగా, గతంలో తన అత్తగారికి, తన తల్లికి అవయవ దానం గురించి జరిగిన చర్చను గుర్తు చేసుకున్నారు.

అప్పుడు వారు “కాలి బూడిద అయ్యే శరీరానికి చచ్చిపోయాక ఏం చేస్తాం, నీ ఇష్టం ఇచ్చేద్దాం,” అని అన్నారని చిరంజీవి చెప్పారు. ఆ మాటనే ఒక ప్రతిజ్ఞగా భావించి, అల్లు అరవింద్‌తో మాట్లాడి, కనకరత్నమ్మ కళ్ళను దానం చేయించారు. తాను స్వయంగా అత్తగారి నేత్రాలను దానం చేసిన ఫోటోలను మీడియాకు చూపించి, అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ఈ గొప్ప నిర్ణయం పట్ల పలువురు ప్రముఖులు చిరంజీవికి ప్రశంసలు తెలియజేస్తూ, ఆయన సామాజిక బాధ్యతను కొనియాడుతున్నారు. ఈ సంఘటన వేలాది మందికి అవయవ దానం ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నారు.

 


Spread the love
Tags: Allu Aravind's mother's deathAllu RamalingaiahChiranjeevi's eye donationKanakaratnamma's eye donationMegastar chiranjeeviorgan donationఅల్లు అరవింద్ తల్లి మృతిఅల్లు రామలింగయ్యఅవయవ దానంకనకరత్నమ్మ నేత్రదానంచిరంజీవి నేత్రదానంమెగాస్టార్ చిరంజీవి
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.