Covid 19 Cases : కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పింది.ఒక్కక్కరిని కబలిస్తూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరిగాయి.ఏకంగా కొత్తగా 12,591 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే వైరస్ తో 40 మంది మృతి చెందగా..
20 శాతం పాజిటివ్ కేసులు పెరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 65,283 యాక్టీవ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకు మొత్తంగా 4.47 కోట్ల కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా వైరస్ బారిన పడి 5.31 లక్షల మంది మృతి చెందారు.
కర్ణాటక, కేరళ ,తమిళనాడు,హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్, రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.
బయటికి వచ్చేముందు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అని..అత్యవసరం అయితేనే బయటికి రావాలి,శుభ్రతను పాటించాలి అని వైద్యులు,ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నారు.