Covid 19 : దేశంలో మళ్ళీ కోవిడ్ కేసుల కలకలం మొదలైంది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కోవిడ్ కేసులు ప్రజలందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో, ఒక్కసారిగా గడిచిన 24 గంటల్లో గణనీయంగా 841 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తుంది. కొన్ని నెలల నుండి అడపాదడపా అక్కడక్కడ మాత్రమే నమోదైన కేసులు ఒక్కరోజులోనే 800 దాటడం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది.
దేశవ్యాప్తంగా 5389 పాజిటివ్ కేసులు ఉండగా, ఫిబ్రవరి నెలలో 18వ తేదీ 112 కేసులు నమోదైతే, నెల తర్వాత 626 కు పైగా కేసులు నమోదయ్యాయి అని కేంద్రా ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కేసులు తీవ్రత గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని, ఇప్పటికే కరోనాతో మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు, జార్ఖండ్లో ఒకరు మరణించారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్ణాటకలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.77గా ఉండగా,
కేరళలో 2.64 శాతం, తమిళనాడులో 1.99శాతం, మహారాష్ట్రలో 1.92శాతం, గుజరాత్లో 1.11శాతం, తెలంగాణలో 0.31శాతం పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది. మళ్లీ కోవిడ్ భూతం విజృంభిస్తుండడంతో ప్రజలందరూ అప్రమత్తగా ఉండి, జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని ఎక్కడ అయితే మరణాల రేటు, పాజిటివ్ రేటు ఎక్కువగా ఉందో ఆ రాష్ట్రాలు అన్ని అప్రమత్తంగా ఉండి కోవిడ్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వాలు, కేంద్ర ఆరోగ్య శాఖ వారు సూచిస్తున్నారు.
Discussion about this post