Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. కిషన్ రావుపేట వద్ద పవన్ కాన్వాయ్ ని ఫాలో అయ్యేందుకు ప్రయత్నించి ఓ అభిమాని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కొండగట్టు, ధర్మపురి పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్.. హైదరాబాద్ తిరిగి బయల్దేరగా, ఆయన కాన్వాయ్ను కొంత మంది అభిమానులు ఫాలో అయ్యారు.

పవన్ కాన్వాయ్ వెంట వెళ్తూ, తమ అభిమాన నేతకు అభివాదం చేసే ప్రయత్నం చేసి నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో తలకు తీవ్ర గాయమై ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Gallery : Urvashi Rautela Hot Photos
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రెండు బైకులు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
