Hen : ప్రకృతి ఎన్నో వింతల మయం ప్రకృతిలో మనకు ఆశ్చర్యం గొలిపే అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రకృతిలోనీ చాలా ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉండదు. కానీ తలుచుకుంటే మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా కనిపెట్టగలడు. దాంట్లో ఒకటే “కోడి ముందా గుడ్డు ముందా” అనే ప్రశ్న. ఇప్పటికీ ఎవరినైనా దీని గురించి అడిగితే సరైన సమాధానం చెప్పలేరు.
కానీ అలాంటి క్లిష్ట ప్రశ్నకు కూడా శాస్త్రవేత్తలు సమాధానం తేల్చేశారు. కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కోడి ముందని నిర్ధారించారు. దానికి కారణం ఏమిటంటే పక్షులు, క్షీరదాలు, మొదట గుడ్లు పెట్టడానికి బదులుగా పిల్లలకే జన్మనిచ్చి ఉండవచ్చని బ్రిస్టల్ విశ్వవిద్యాలయం సరికొత్తగా చేసిన పరిశోధనలో తేలింది. 29 జీవజాతులపై మరియు 51 శిలాజా జాతులపై చేసిన ఈ పరిశోధనలో ఈ రకమైన ఫలితాలు వెల్లడయ్యాయి.
గుడ్డు లోపలి భాగంలో రక్షిత పొర అయిన అమ్నియోన్లో పిండం లేదా పిండం అభివృద్ధి చెందే సకశేరుకాల సమూహాన్ని అమ్నియోట్స్ అంటారు. గట్టి పెంకుతో ఉన్నటువంటి గుడ్డు వీటి విజయానికి ప్రధానమని భావించారు. కానీ నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ పరిశోధనలో తేలింది ఏమిటంటే, పరిణామ శాఖలో క్షీరదాలు లెపిడోసౌరియా అంటే బల్లుల జాతి,
ఆర్కోసౌరియా అనగా డైనోసార్లు, మొసళ్ళు, పక్షులు పూర్వీకులలో అంటే తల్లి యొక్క శరీరంలో పిండం ఎదుగుదలను వీటన్నింటి గురించి పిండ నిలుపుదలని వెల్లడిస్తున్నాయి. గట్టి పెంకు గుడ్డు తరచుగా ఆవిష్కరణలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ కూడా ఈ పరిశోధన నిర్దిష్ట జంతువుల సమూహానికి చివరి రక్షణను అందించింది. EER ఎక్స్టెండెడ్ ఎంబ్రియో రిటెన్షన్ అని సూచిస్తుంది.