హైదరాబాద్ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం తమ వంతు సాయంగా హెటిరో డ్రగ్స్ 10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది.
వరదల వల్ల ఎక్కువగా నష్టపోయిన పేదలను ఆదుకోవడానికి సీఎం శ్రీ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు స్పందించి ఈ సహాయం అందిస్తున్నట్లు హెటిరో డ్రగ్స్ ఛైర్మన్ శ్రీ పార్థసారథి రెడ్డి వెల్లడించారు.