అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ధడక్ అనే మూవీతో బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. టాలెంట్ తో ఎదిగే ప్రయత్నం చేస్తోంది బ్యూటీ. అయినా సరే ఇండస్ట్రీలో నెపొటిజం పేరుతో ట్రోల్స్ తప్పడం లేదు జాన్వీకి.
రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ ఈ విధంగా మాట్లాడింది. చాలామందికి నా గురించి దురభిప్రాయం ఉంది. నేను వారసత్వంతో వచ్చి.. స్టార్ డమ్ పొందాలనుకోవడం లేదని.. అయినా తానేమీ గొప్ప టాలెంట్ ఉన్న దానిని కాకపోవచ్చని, అలాగే గొప్ప అందగత్తెను కూడా కాకపోవచ్చని వ్యాఖ్యానించింది. కాకపోతే.. తాను షూటింగ్ కు వెళ్తే సెట్స్ లో కష్టపడి పని చేస్తానని అంటోంది జాన్వీ.
సెట్ లో తాను ఎంత కష్టపడతాను అనేది రక్తంతో రాసివ్వడానికి కూడా వెనకాడనంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో కొనసాగుతోంది జాన్వీ కపూర్. ఆమె సౌత్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందని, విజయ్ దేవరకొండ జోడీగా నటించబోతుందంటూ.. రకరకాల వార్తలు వచ్చాయి కానీ జాన్వీ కపూర్ తో పాటు ఫ్యామిలీ కూడా ఇంత వరకు దీనిపై స్పందించలేదు.