India Vs Australia 3rd Test :109 కే కుప్పకూలిన భారత్… తాము పన్నిన ఉచ్చులోనే చిక్కిన వైనం
అనుకున్నదొక్కటి..అయ్యింది ఒక్కటి
బోల్తా కొట్టిందిలే భారత్ జట్టు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టుల సిరీస్ లో భాగంగా ఈ రోజు జరిగిన మూడవ టెస్ట్ లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయింది.భారత్ బ్యాటర్లు అంతా ముకుమ్మడిగా పెవిలియన్ కి క్యూ కడుతూ దాదాపు మొదటి షెషన్ కే చాప చుట్టేశారు.
స్పిన్ కి అంత్యంత అనుకూలంగా ఉన్న పిచ్ పై టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన టీం,మొత్తం స్పిన్నర్ల చేతిలోనే మూకుమ్మడి వైఫల్యం తో, తాము తయారుచేసుకున్న స్పిన్ ఉచ్చు లోనే చిక్కుకొని విలవిల్లాడారు. కేవలం 31.3 ఓవర్లు మాత్రమే సాగిన భారత్ ఇన్నింగ్స్ 109 పరుగుల వద్దే ముగిసింది.భారత్ బ్యాటర్లలో రోహిత్12), గిల్(21),పుజారా(1), జడేజా(4),శ్రేయాస్(0),కోహ్లీ (22), భరత్(17), అశ్విన్(3),సిరాజ్(0), అక్షర్(12) పరుగులు మాత్రమే చేశారు.చివర్లో ఉమేష్ రెండు సిక్సర్ల పుణ్యమా అని 100 పరుగులు దాటగలిగింది ఇండియా.కుహనే మన్ 5 వికెట్లతో సత్తా చాటగా, లియాన్ 3, మర్ఫి 1 వికెట్ తీసి భారత్ పతనాన్ని శాసించారు.