కోవిడ్ కారణంగా ఆర్టీసీ కనీవినీ ఎరుగని నష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ.. 52వేల మంది ఉద్యోగులకు జీతాలు అందుతున్నాయి. కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశారు. ఇటీవలే 2013 పే స్కేల్ బకాయిలు రూ.800 కోట్లు విడుదల చేశారు. విలీనం తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే కారుణ్య నియామకాలను ఆర్టీసీ ఉద్యోగులకు వర్తించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన కార్మికులకు ప్రభుత్వం కల్పించే ‘మరణానంతర ప్రయోజనాలు’ వర్తింపజేస్తూ గత వారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఈ ఆర్టీసీలో మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. లైంగిక వేధింపులపై ప్రాంతీయ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసింది. రూ.10 లక్షల బీమా కల్పించింది. విధి నిర్వహణలో ఉన్నా లేకున్నా ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ బీమా వర్తిస్తుంది. ఈ ఏడాది మే 31నాటికి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్టు సిబ్బందికి ఈ బీమా వర్తిస్తుంది.