Kantara Chapter 1: కాంతార ప్రీక్వెల్ కోసం ఎన్టీఆర్.. ఇక రచ్చ రచ్చే..
Kantara Chapter 1: పాన్ ఇండియా బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘కాంతార’ చిత్రానికి సంబంధించిన ప్రీక్వెల్ ‘కాంతార: ఏ లెజెండ్ (Kantara Chapter 1)’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా, తెలుగులో జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ భారీ వేడుక సెప్టెంబర్ 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనుంది. ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమా తెలుగు ట్రైలర్ను విడుదల చేసి అంచనాలు పెంచగా, ఇప్పుడు ఎన్టీఆర్ హాజరు కావడంతో సినిమాపై ఉన్న క్రేజ్ మరింత రెట్టింపైంది.
రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ అనుబంధం
దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టికి, ఎన్టీఆర్కి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఎన్టీఆర్ తల్లి కర్ణాటకకు చెందినవారు కావడంతో, ఆయనకు కన్నడ భాష, సంస్కృతిపై ప్రత్యేక అభిమానం ఉంది. గతంలో కుటుంబంతో కలిసి కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించినప్పుడు ఎన్టీఆర్ రిషబ్ శెట్టి కుటుంబాన్ని కలిసిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ మళ్లీ ‘కాంతార: ఏ లెజెండ్’ వేదికపై కలిసి కనిపించి సందడి చేయనున్నారు.
హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో, రిషబ్ శెట్టి కథ, దర్శకత్వం, ప్రధాన పాత్రను పోషించారు. ఈ ప్రీక్వెల్లో యువరాణిగా రుక్మిణీ వసంత్ నటిస్తుండగా, దిల్షాన్ దేవయ్య కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ ద్వారా మరింత ప్రచారం లభించనుంది.