ktr Tweet : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి, బిఆర్ఎస్ పార్టీ ఓటమిని చవి చూసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సంబంధించి కేటీఆర్ చేసిన ట్వీట్ సంచాలనంగా మారింది. నిన్నటి వరకు కూడా తము బీఆర్ఎస్ పార్టీనే గెలుస్తుందని, నాలుగో తారీఖున క్యాబినెట్ సమావేశం కూడా నిర్వహిస్తామని, ప్రజలు ఇంకా మావైపే ఉన్నారని ఎంతో ధీమాగా చెప్పినటువంటి కేటీఆర్ ,కెసిఆర్ ఎగ్జిట్ పోల్స్ కూడా
నమ్మనటువంటి కేటీఆర్ డిసెంబర్ మూడో తారీఖున తెలుస్తుంది నిజమైన పోల్స్ ఏంటి అని గెలుపు పై తమ ధీమాను ప్రకటించారు. కానీ కేటీఆర్ ఈరోజు కాంగ్రెస్ కి అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ఓటమిని ఒప్పుకొని ప్రజలు మార్పును కోరుకున్నారు. ఎప్పుడైనా మేము ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాము. 10 సంవత్సరాలు ప్రజల కోసము పని చేశాము. రెండుసార్లు మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఈ రకంగా ట్వీట్ చేశారు.

‘తెలంగాణలో ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయి. ఈరోజు ఫలితం గురించి బాధపడటం లేదు. ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందాను. రెండుసార్లు బీఆర్ఎస్కు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ ఫలితాలను ఒక అభ్యాసంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం. ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్కు అభినందనలు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా కేటీఆర్ మాత్రం సిరిసిల్లలో విజయం సాధించారు. 29 వేల మెజారిటీతో కేటీఆర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో దాదాపు 89 వేల మెజారిటీతో గెలిచిన కేటీఆర్, ఈసారి కేవలం 29, మెజార్టీతో గెలిచారు. స్వల్ప మెజారిటీ రావడంతో కేటీఆర్, బి ఆర్ ఎస్ కూడా ఈ విషయంపై నిరాశగా ఉన్నాయి.
