ఈ మధ్య కొత్త సినిమాల రిలీజ్ కు సైతం రాని ఎక్సయిట్మెంట్ రీ రిలీజ్ ని చూశాక వస్తోంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి, బిల్లా వంటి సినిమాలు రాగా.. ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషీ సినిమా రీరిలిజ్కు సిద్ధమైంది. ఈ సినిమా పవర్ స్టార్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి, ఎన్నో రికార్డులను నెలకొల్పింది.
Also Read: ఫ్లాప్ లో ఉన్నా సరే.. ఆ.. ఇద్దరి డైరెక్టర్స్ కి ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..
రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని శ్రీసూర్య మూవీస్ బ్యానర్పై ఏఎమ్ రత్నం నిర్మించగా, ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ హీరోగా, భూమిక హీరోయిన్గా నటించారు.
కాగా, ఈ సినిమాను డిసెంబర్ 31న రీరిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ను సోషల్ మీడియాలో రిడుదల చేశారు. ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4K రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.