• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Mrigashira Karte : మృగశిర కార్తె వచ్చేసింది.. ఈరోజు చేపలకు గిరాకే..గిరాకీ.. 

Rama by Rama
June 8, 2023
in Latest News
0 0
0
Mrigashira Karte : మృగశిర కార్తె వచ్చేసింది.. ఈరోజు చేపలకు గిరాకే..గిరాకీ.. 
Spread the love

Mrigashira Karte : ఈరోజు (బుధవారం) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కాబోతుంది. రోహిణి కార్తెలో ఎండలు ఎంతలా విజృంభించాలో అంత వేడిని, వడగాలును మనకు రుచి చూపించాయి. మృగశిర కార్తెలో నుండి వాతావరణం చల్లబడు తుంది. మనం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చును. అయితే ఈ మృగశిర కార్తెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

సూర్య భగవానుడు ఒక్కొక్క కార్తెలో 14 రోజులపాటు ఉండి ఏ నక్షత్రానికైతే దగ్గరగా ఉంటాడో ఆ కాలానికి (కార్తె) అ నక్షత్రం పేరు పెడతారు. అశ్విని నక్షత్రంతో ప్రారంభమైన ఈ కార్తెలు, రేవతి నక్షత్రంతో ముగుస్తాయి. మొత్తం 27 నక్షత్రాల పేర్లతో 27 కార్తెలు ఉంటాయి. సౌరమాన లెక్కల ప్రకారం, ఈ కార్తెలు ఆంగ్ల గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీలలో వస్తూ ఉంటాయి.

రోహిణి కార్తెలో మండుటెండల్లో ఉన్నటువంటి ప్రజలు, మృగశిర కార్తె కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వర్షానికి తొలిమెట్టు ఈ మృగశిర కార్తెనే. రోహిణి కార్తెలో రొళ్లు పగిలే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజానీకం, ఈ మృగశిర కార్తె నైతిరుపతి పవనాల రాకతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది.

ఈ కార్తెతో రైతన్నలు వ్యవసాయాన్ని మొదలు పెట్టుకునే రోజులు ప్రారంభమవుతాయి. దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటారు. తొలకరి జల్లులు పడడంతోనే విత్తనాలు చల్లడం మొదలుపెడతారు. ఈ కార్తెకు ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క విశిష్టత ఉంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దీన్ని జరుపుకుంటారు. కొందరు బెల్లంలో, ఇంగువను కలిపి తింటూ ఉంటారు.

ఎందుకంటే ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షాకాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని భావిస్తారు.ఇంకొంతమంది ఈ మృగశిర కార్తె రోజు ఖచ్చితంగా చేపలను వండుకొని తింటారు. అలా తినడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నియంత్రించవచ్చు అని వారి నమ్మకం.

ఉబ్బసం వ్యాధి ఉన్నవారికి ఈ కార్తె రోజు చేప మందు పంపిణీ : ఉబ్బసం (ఆస్తమా) రోగులకు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని సోదరులు చేపమందు ప్రసాదం పంపిణీ చేస్తారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మృగశిర కార్తె దేవగణానికి చెందినది. దీనికి అధిపతుడు కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి అదృష్టం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు.

ఈరోజు చేపలకు భలే గిరాకి : మృగశిర కార్తె రోజు చేపలను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ప్రజల విశ్వసిస్తూ ఉంటారు. దాని కారణంగా ఈరోజు మార్కెట్లలో చేపలకు చాలా గిరాకీ ఉంటుంది. చేపలను అధిక ధర పెట్టి విక్రయిస్తూ ఉంటారు.

 


Spread the love
Tags: AstrologyBad Food Habits in TeluguFoodHealth BenefitsHealth ProblemsHealth tips in TeluguLife styleMrigashira KarteSignificance of Mrigashira Karte
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.