• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Nadendla Manohar : ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం చేతగాని అధికార ప్రభుత్వం : నాదెండ్ల మనోహర్

Rama by Rama
May 19, 2023
in Latest News, Political News
0 0
0
Nadendla Manohar : ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం చేతగాని అధికార ప్రభుత్వం : నాదెండ్ల మనోహర్
Spread the love

Nadendla Manohar : పేద ప్రజల కోసం పనిచేయని అసమర్ధ ప్రభుత్వం. కనీసం ఆరోగ్యశ్రీ సేవలు కూడా అందించలేకపోతోంది. పేదల కోసమే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పి గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం ఈరోజు అదే పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ నిధులను కేటాయించలేక పోతుంది. ఇది ఆ ప్రభుత్వం పేద ప్రజల పైన చూపిస్తున్న ప్రేమ అని, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ

ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. పేదల పైన నిజంగా ప్రేమ ఉంటే వెంటనే బటన్ నొక్కి ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వాలని మనోహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ పాలకుల అసమర్థ, ఆర్థిక నిర్వహణ వల్ల ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా వైద్యం చేసి నెట్వర్క్ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు బకాయిపడింది. 

తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని ఆసుపత్రుల నిర్వాహకులు అనేకమార్లు ప్రభుత్వాన్ని కోరినా సరిగా స్పందించలేదు. అరకొరగా నిధులు ఇచ్చి పేదలకు వైద్యం చేయిస్తున్నాం అని మభ్యపెట్టే ప్రయత్నాలే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నాయి. అనీ నాదెండ్ల ప్రభుత్వంపై మండిపడ్డారు. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవలు కొనసాగించలేమని నెట్వర్క్ ఆసుపత్రులు గత నెలలోనే తేల్చి చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు.

ఇదేనా పేదల పక్షం ఉన్నామని గొప్పలు చెప్పుకొనే వ్యక్తి పాలన, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోతే ఇక్కట్ల పాలయ్యేది పేదలే అని తెలుసుకోవాలి. ఈ ముఖ్యమంత్రికి నిజంగా పేదలపై ప్రేమ ఉంటే బటన్ నొక్కి నిధులు ఇచ్చి, ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోకుండా చూసేవారు. కానీ ఈ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఒక్క బటన్ నొక్కి ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేకపోయింది అన్నారు.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన జనసేన పార్టీ ఆరోగ్య శ్రీ నిధుల కేటాయింపులు సక్రమంగా లేవని, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించడం లేదని, దాని ఫలితంగా పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి మేము పదేపదే చెప్పాము. అయినా పాలకులకు ఈ మాటలు చెవికి ఎక్కలేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ప్రతిపక్షాలను విమర్శిస్తూ కాలం వెళ్ళబుచుతూ అదే పాలన

అనుకునే ముఖ్యమంత్రి ముందుగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలి. అని నాదెండ్ల మనోహర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

 


Spread the love
Tags: AP NewsBjpChandrababuNaiduGeneral Secretary of Janasena PartyJanaSainikJanasenaJanaSena Party PAC Chairman  Nadendla Manohar in Janasena PressmeetNadendla Manohar's Words about the YCP GovernmentNagababuNaraLokeshPawan KalyanTdpYS JaganYsrcp
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.