పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట ధ్వంసం చేశారు. దీనిపై టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపాయి.
ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలకు దేశంలోనే కాకుండా ప్రపంచం నలుమూలలా గుర్తింపు తెచ్చిన మహానుభావుడు శ్రీ నందమూరి తారకరామారావు గారు. ఆయన విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆయన ఆనవాళ్ళు పెకిలించాలాని అనుకోవటం మూర్ఖత్వం, రాక్షస చర్య, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఎన్టీఆర్ గారి విగ్రహం ధ్వంసం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
