Poonam Kaur: నందమూరి vs మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన పూనమ్ కౌర్.. బాలయ్యపై ప్రశంసలు, మెగా ఫ్యాన్స్ ఫైర్
Poonam Kaur: సినిమాల కంటే తన సోషల్ మీడియా వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే నటి పూనమ్ కౌర్ మరోసారి వివాదాస్పద ట్వీట్తో హాట్ టాపిక్గా మారారు. ఇటీవలే ‘ఓజీ’ సినిమాను ప్రశంసించిన వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె, తాజాగా నందమూరి బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో మెగా, నందమూరి అభిమానుల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
2024 సెప్టెంబర్ 1న పూనమ్ కౌర్ ఒక ట్వీట్ చేస్తూ.. “బాలయ్య పెద్ద వృక్షం లాంటి వారు. అది అన్ని కాలాల్లోనూ మనుషులకు, జంతువులకు నీడనిస్తుంది. ‘ఆదిత్య 369’ నుంచి ‘భగవంత్ కేసరి’ వరకు ఆయన చిన్న పిల్లాడిలా ఉత్సాహంగానే ఉన్నారు. అది ఆయనకు దేవుడు, తండ్రి ఎన్టీఆర్ ఇచ్చిన ఆశీర్వాదం” అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్కు ‘సమరసింహారెడ్డి’ సినిమాలోని ఒక పాటకు పూనమ్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో ఆమె డ్యాన్స్ చేస్తుండగా బాలకృష్ణ ఉత్సాహంగా చూస్తున్నట్లు కనిపిస్తుంది.
తాజాగా, ఆ పాత ట్వీట్ను ట్యాగ్ చేస్తూ పూనమ్ మరో పోస్ట్ చేశారు. “బాలయ్య ఎప్పుడూ చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా ఉంటారని నేను ఎప్పుడూ చెబుతుంటాను. దేవుడు కొందరు వ్యక్తుల్ని ఒక లక్ష్యం కోసం సాధనంలా సృష్టిస్తాడు. అది సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది” అని పేర్కొన్నారు.
ఈ ట్వీట్తో నందమూరి అభిమానులు సంతోషంగా ఉండగా, మెగా ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ గతంలో మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ “బాలయ్య అన్న మాటలు మరిచిపోయావా?” అని కొందరు ప్రశ్నించారు. మరికొందరు “పవన్ కల్యాణ్, త్రివిక్రమ్లను కించపరిచిన నువ్వు, ఇప్పుడు బాలయ్యపై పొగడ్తలు ఎందుకు?” అని ఆమె వైఖరిని విమర్శిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో ఫేమస్ అవ్వాలని చూస్తున్నావంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
ఇటీవలే బాలకృష్ణ ఎమ్మెల్యే హోదాలో చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా, చిరంజీవి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి వాటిని ఖండించారు. ఈ నేపథ్యంలో, అభిమానుల మధ్య ఇప్పటికే సోషల్ మీడియా వార్ నడుస్తుండగా, పూనమ్ కౌర్ చేసిన ఈ ట్వీట్ మరింత అగ్నికి ఆజ్యం పోసిందని ట్రోల్ చేస్తున్నారు.