Ram Charan : హైదరాబాద్ లో జరిగిన వీడ్కోలు మ్యాచ్ లో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆదివారం ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ కాంప్లెక్స్ లో జరిగిన రెండు మిక్స్డ్ డబుల్ ఎగ్జిబిషన్ మ్యాచులో సానియా జోడి విజేతగా నిలిచింది. సానియా తన 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అనేక అభిమానుల మధ్య గ్రాండ్ గా వీడ్కోలు పలికింది. సానియా ఆఖరి మ్యాచ్ చూసేందుకు కేటీఆర్, క్రికెటర్ అజారుద్దీన్, యువరాజ్ సింగ్, హీరోలు మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్ తదితరులు వచ్చారు.
ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ దేశానికి మరింత మంది సానియాలు అవసరం. కచ్చితంగా మరో సానియాను తయారు చేస్తాను అంది. ఇదిలావుండగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన మంచి ఫ్రెండ్స్. సానియా టెన్నిస్ కు వీడ్కోలు పలికిన సందర్భంగా రామ్ చరణ్ ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ ఓ పోస్ట్ పెట్టాడు. చరణ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇంతకీ చరణ్ తన పోస్ట్ లో ఏం రాసుకొచ్చాడు అంటే.. నా ప్రియమైన స్నేహితురాలు సానియా మీర్జా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ కోర్టులు నీ ఆటను మిస్ అవుతాయి. దేశ క్రీడారంగానికి నువ్వు చేసిన సేవ చాలా గొప్పది. నువ్వు ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను’ అని చరణ్ ట్వీట్ చేశారు. దీనితో పాటు సానియాతో తన ఉపాసన, రామ్ చరణ్ కలిసి దిగిన ఫోటోను షేర్ చేసాడు.
My dearest buddy @MirzaSania … Tennis courts across the world will miss seeing you in action.
Your contribution to sports in India is unmatched.
You continue to make us proud. pic.twitter.com/PL7fYORECZ— Ram Charan (@AlwaysRamCharan) March 6, 2023
Discussion about this post