ఈ ఆదివారం నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ.. వారిద్దరూ కవలలకు జన్మనిచ్చి తల్లిదండ్రులు అయ్యినట్టు ప్రకటించారు. నయన్ అండ్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలోని ఒక ప్రసిద్ధ రిసార్ట్లో కుటుంబ సమేతంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
సరోగసి అంటే అద్దె గర్భం.. అంటే మరో మహిళ గర్భంతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు. చాలామంది సెలెబ్రిటీలు ఇదే విధానంలో తల్లిదండ్రులు అవుతున్నారు. అయితే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. నయనతారకి కవలలు పుట్టిన వేళ సీనియర్ హీరోయిన్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
“భారతదేశంలో సరోగసీ నిషేధించబడింది. వైద్యపరంగా అనివార్య కారణాల కోసం తప్ప, అద్దె గర్భం ద్వారా తల్లిదండ్రులు అవ్వడం చట్టరీత్యా నేరం. ఇది జనవరి 2022 నుండి వచ్చిన చట్టం. దీని గురించి మనం చాలా రోజులుగా వింటూనే ఉన్నాం” అంటూ ట్వీట్ చేసింది.
కస్తూరి ఈ ట్వీట్ నయనతారని ఉద్దేశించే చేసింది అంటూ కొందరు ఆమెని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నా లెక్కలు నాకు ఉన్నాయి. నిస్వార్థంగా నా గళం వినిపిస్తున్నాను అంటూ కస్తూరి మరో ట్వీట్ చేసింది.