నట సింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉంటుందని కొన్నేళ్ళుగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ, ఇప్పటి వరకు అఫీషియల్ న్యూస్ ఏదీ నందమూరి ఫ్యామిలీ నుంచి రాలేదు. అలాగే ప్రస్తుతం మోక్షజ్ఞ లో హీరోకి ఉండాల్సిన లుక్ కనిపించడం లేదు. దీంతో నందమూరి అభిమానులు నిరాశ చెందుతున్నారు.
అయితే సెలెబ్రిటీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తాజాగా మోక్షజ్ఞ కెరీర్ పై హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల్లోకి లేటుగా ఎంట్రీ ఇస్తారని వేణుస్వామి అన్నారు. లేటుగా ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా ఎదుగుతాడని జాతకం చెప్పారు. మోక్షజ్ఞ జాతకం ప్రకారం సినీరంగంలో, కళారంగంలో అతడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు.
నందమూరి వారసుడు అంటే రాజకీయాల ప్రస్తావన ఉంటుంది. రాజకీయాల విషయానికి వస్తే మోక్షజ్ఞకి పాలిటిక్స్ సాధ్యం కాదు అంటూ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నందమూరి అభిమానులు మాత్రం ముందు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే చాలు.. రాజకీయాలు తర్వాత చూసుకోవచ్చు అంటున్నారు.