ఐపీఎల్ మినీ వేలం మొదలైంది. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆయా జట్లలో మిగిలిన స్థానాల కోసం ఆటగాళ్ల కొనుగోలుకు జట్లు రంగంలోకి దిగాయి. అందుబాటులో ఉన్న మొత్తం 405 మంది క్రికెటర్లు వేలంలో అందుబాటులో ఉండగా.. 30 మంది విదేశీ ఆటగాళ్లు సహా 87 మంది ప్లేయర్లను 10 ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. అయితే అనూహ్యంగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరణ్ కోసం బెంగళూర్, ముంబై, రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి.
ఐపీఎల్ 2019లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ను తొలిసారిగా పంజాబ్ కింగ్స్ రూ.7.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2020లో విడుదలయ్యాడు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ రూ.5.5 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది గాయం కారణంగా మెగా వేలంలో పాల్గొనలేదు. కాగా, సామ్ కరణ్ ఈ T20 ప్రపంచ కప్లోని ఆరు మ్యాచ్లలో 6.52 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 13 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్గా కూడా నిలిచాడు. ఫైనల్లోనూ 12 పరుగులకే మూడు వికెట్లు తీశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని బౌలింగ్ అద్భుతంగా ఉంది.
ఈ లెక్కలతోనే ఈ మినీ వేలంలో అందరిచూపను తనవైపునకు తిప్పుకున్నాడు. బేస్ ప్రైజ్ రూ.2 కోట్లతో వేలంలోకి ఎంట్రీ ఇచ్చిన కర్రన్ను రూ. 18.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. బేస్ ధర రూ.2 కోట్లు కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు సౌతాఫ్రికా ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ రూ. 16.25 కోట్లతో టాప్ లో ఉండగా కరణ్ ఆ రికార్డ్ ను చేరిపేశాడు.