Woman Attacked for Voting for BJP Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సొంత జిల్లా అయినటువంటి సెహోర్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక మహిళ భారతీయ జనతా పార్టీ బిజెపికి ఓటు వేసినందుకు ఆమె పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు ఆమె బంధువు. వివరాల్లోకి వెళితే..
సదరు మహిళ బీజేపీకి ఓటు వేసి అక్కడ వాళ్ళు గెలిచిన తర్వాత సంబరాలాల్లో పాల్గొంది. దీనంతటిని గమనించిన ఆమె బావ ఆమెను చాలా దారుణంగా కొట్టాడు. దాంతో ఆ మహిళ న్యాయం కోసం కలెక్టర్ ని ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ ఫిర్యాదు మేరకు అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ లో నిందితుడు పై ఐపీసీ 294, 323, 506 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసును నమోదు చేశారు.
సెహోర్ అసెంబ్లీ పరిధిలోని బర్ఖేదా హసన్ గ్రామానికి చెందిన బబ్లూ ఖాన్, భార్య సమీనా బీ. డిసెంబర్ 4వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి బిజెపి విజయ సంబరాలలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె భావ జావేద్ ఖాన్ అతని తండ్రి బహిర్ ఖాన్ తనను ఆ సంబరాల్లో పాల్గొనవద్దని బెదిరించారని, ఆ తర్వాత వారి మాట విననందున ఆమెపై తీవ్రంగా విచక్షణ రహితంగా దాడి జరిపారని తన ఫిర్యాదులో పేర్కొంది సమీనాబి.

ఆ సమయంలో తన అరుపులు విన్న ఇరుగుపొరుగు వారి వచ్చి ఆ దాడిని ఆపారని ఆమె వెల్లడించింది. ఆ దాడి జరిగినప్పుడు తన భర్త అందుబాటులో లేడని, తనను ఒంటరిదాన్ని చేసి ఈ విధంగా దాడి చేశారని పేర్కొంది. న్యాయం కోసం కలెక్టర్ ను ఆశ్రయించానని తను చెప్పింది. ఈ ఘటనపై జాతీయ పస్మాండ ముస్లిమ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నౌషాద్ ఖాన్ స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.
