Health and Skin Tips : అమ్మాయిలు అందంగా కనిపించడం కోసం మేకప్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దాంట్లో భాగంగానే చేతులు, కాళ్లకు కూడా నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడుతుంటారు. గోళ్ళ మీద రంగులు వేయడం అనేది ఇప్పుడు ఎన్నో ప్రత్యేకతలతో కూడుకున్నది. బ్యూటీ పార్లర్ లో కాళ్లు, చేతులు శుభ్రం చేయడం కోసం మ్యానుక్యూర్ వాడుతారు.
దీన్ని వాడడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మ్యానుక్యూర్ తో భారతదేశంలో ప్రతి సంవత్సరం 13 బిలియన్ డాలర్ల బిజినెస్ జరగడం గమనార్హం. ఈ మ్యానుక్యూర్, పెడిక్యూర్ వల్ల చాలా నష్టాలు జరుగుతాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా వీటివల్ల క్యాన్సర్ వచ్చి, ప్రమాదకర రాషెస్ వస్తాయని, లీసా డూరీ అనే శాస్త్రవేత్త వెల్లడించారు.
అలాగే జల్ నెల్స్, ఆర్టిఫిషియల్ నెయిల్స్ వల్ల సమస్యలు వస్తున్నట్లు ఆమె తెలిపారు. లీసాడూరీ ఆర్టిఫిషియల్ నెయిల్స్, జెల్ నెయిల్స్ వాడడం వల్ల ఆమె క్యాన్సర్ బారిన పడినట్టు తెలిపింది. వాటి వల్ల గొర్ల వెనుక రంగు మారి,తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైద్య పరీక్షల తర్వాత ఆమెకు స్కిన్ క్యాన్సర్ వచ్చినట్టు తేలిందంట.
దీని ప్రభావం ఎక్కువగా ముఖంపై, మెడపై ఉంటుంది. సెలూన్ లో పనిచేసే వర్కర్లు కూడా అక్కడి వాసనల వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్లు తెలుస్తుంది. వారు ఎక్కువగా ఫెర్టిలిటీ ప్రాబ్లం తో బాధపడుతున్నారు. స్కిన్ క్యాన్సర్ వల్ల క్రమేపి చేతులు పనిచేయకపోవడం, అలాగే అల్ట్రా వైలెట్ లైటింగ్ పై పెయింటింగ్ వాడటం వల్ల చర్మ వ్యాధులు వచ్చినట్టు అధ్యయనాల్లో తేలింది.
గోళ్ళ రంగు వాడడం వల్ల క్యాన్సర్ రావడం అనేది చాలా అరుదైన విషయం. చర్మ క్యాన్సర్ తో చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందం కావాలనుకునే అమ్మాయిలు ,మహిళలు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతగానో ఉంది.