Health Tips : మనం రోజువారి జీవితంలో చాలా రకాల ఆహారం తీసుకుంటూ ఉంటాము. ప్రతి ఆహారం మన ఆరోగ్యానికి మంచే చేస్తుంది. అనే నమ్మకంతో ఉంటాము. కానీ మంచి ఆహారంతో పాటు విషపూరితమైన ఆహారాన్ని కూడా మనకు తెలియకుండానే మన శరీరంలోనికి మన చేతులతో మనమే పంపిస్తున్నాము. మీరు వింటున్నది నిజమే. అట్లాంటి ఆహారం కూడా ఉంటుందా.. అది కూడా మనం తినే రోజువారి ఆహారంలో అని మీకు కాస్త ఆశ్చర్యం కలగవచ్చు. కానీ ఇది వాస్తవం. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం..
తీసుకునే కొన్ని ఆహార పదార్థాల వల్ల మనకు తెలియకుండానే మన మెదడు నిద్ర వస్తలోకి వెళ్ళిపోతుంది. తద్వారా కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా జరిగిన కొంత కాలానికి మనిషి చనిపోయిన కూడా ఆశ్చర్యపోనవసరం లేదని వారు వెల్లడిస్తున్నారు. అంతా డేంజర్ ఆహారం ఏంటంటే..
బంగాళదుంపలు ఇవి చాలామంది ఎక్కువ శాతం తింటూ ఉంటారు చాలా ఇష్టంగా తినే బంగాళదుంపను ఒక్కోసారి మన శరీరంలో విషాన్ని కుమ్మరిస్తుంది. దుంప మీద గ్రీన్ కలర్ వచ్చిందంటే మాత్రం దాన్ని పక్కన పెట్టడం మంచిది. గ్రీన్ కలర్ ఉన్న భాగాన్ని కూడా మనం కట్ చేసి వండుకొని తినడం వల్ల అది మన శరీరంలో విషాన్ని నింపుతుంది.
బిర్యానీలో ఎక్కువగా వాడే జాపత్రి అందరికీ తెలుసు. దీనినీ తింటే ఒక లాంటి మత్తు మన శరీరాన్ని ఆవహిస్తుంది. చాలామంది బిర్యాని తిన్న వెంటనే అలాంటి ఫీలింగ్ ని పొందుతారు. వాస్తవానికి జాపత్రి ఎంత డేంజర్ అంటే మనం ఎక్కువగా దీని తీసుకుంటే ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
ఆల్మండ్ దీన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. బ్రౌన్ కలర్ లో ఉన్న బాదం మంచిదే కానీ గ్రీన్ కలర్ లో ఉన్నవి తీసుకుంటే మాత్రం ప్రమాదమే. రాజ్మ్ అంటే మన భాషలో చిక్కుడుకాయలు వీటిని ఆఫ్ బాయాల్ చేసి అసలు తినకూడదు. బాగా ఉడికించిన తర్వాతనే తినాలి
వైట్ రైస్ ని అవాయిడ్ చేసి చాలామంది ఈమధ్య బ్రౌన్ రైస్ ని తింటున్నారు. దీనివల్లనే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్ లో పురుగులు తొందరగా పడతాయి. అవి మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి రైస్ ని త్రీ, ఫోర్ టైమ్స్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత తినడం మంచిది.