Health Tips : మారుతున్న జీవనశైలి ఆధారంగా రోజు,రోజుకి వ్యాధులు కూడా ఎక్కువ అవుతున్నాయి. చాలామంది ఇబ్బంది పడుతున్న వ్యాధి టైప్ 2 డయాబెటిస్. ఇది వయసుతో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తుంది. మధుమేహం శాశ్వత పరిష్కారం లేని వ్యాధి. దీనిని ఆహారపు అలవాట్లతో మాత్రమే నియంత్రణలో ఉంచుకోవాలి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం, అది సోకిన వారు స్వీట్లు తినడం తగ్గించడం, చక్కెరకు బదులుగా సహజ చక్కర అంటే పండ్లు లాంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
అయితే కొన్ని రకాల పండ్లు డయాబెటిక్ శాతాన్ని పెంచి ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అసలు డయాబెటిక్ ఉన్నవాళ్లు ఎలాంటి పండ్లు తీసుకోవాలి. ఏలాంటివి తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
అరటిపండు : అరటి పండులో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ కంటెంట్ చక్కెర స్థాయిని పెంచుతుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు వీటికి దూరంగా ఉండాలి.
అనాస పండు : పైనాపిల్ లో విటమిన్ సి మనకు దొరుకుతుంది. కానీ దీంట్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువే.
సపోటా : సపోటా లో ఉండే తీపిదనం ఆ పండ్లను ఇష్టపడడానికి ఎక్కువగా దోహదపడుతుంది. కానీ డయాబెటిస్ వారు ఈ పండుకు దూరంగా ఉండాలి. దీంట్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.
ఏ పండ్లు తినాలి : డయాబెటిక్ పేషెంట్లు అతి తక్కువ పరిమాణంలో యాపిల్ పండును తినవచ్చును. అలాగే నారింజ పండ్లలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. వీటిని కూడా తినడం మంచిది.