Health Tips : ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున కొన్ని పండ్లు తినడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. జీర్ణ వ్యవస్థను పండ్లు బలపరుస్తాయి ఖాళీ కడుపుతో తినడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
యాపిల్ : పరగడుపున యాపిల్ తినడం వల్ల శరీరం ఫీట్ గా ఉంటుంది.అనేక పోషకాలు అందుతాయి. ప్రతిరోజు ఒక యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు అని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. అలాగే బరువు తగ్గాలనుకునేవారు యాపిల్ తినడం ఉత్తమం. దీంట్లో విటమిన్ సి, ఐరన్, ఫైబర్ ఉంటాయి. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు యాపిల్ పండు బలాన్ని ఇస్తుంది.
పుచ్చకాయ : పుచ్చకాయ వేసవిలో మనకు ఎక్కువగా దొరుకుతుంది. కానీ ఇప్పుడు సీజన్ తో పని లేకుండా, ప్రతి సీజన్లో కూడా పుచ్చకాయ అందుబాటులో ఉంటుంది. దీనిలో ఉండే ఫైబర్, విటమిన్ సి, కార్బోహైడ్రేటు, ప్రోటీన్లు శరీరాన్ని ఎక్కువసేపు హైడ్రేట్ గా ఉంచుతాయి. ఖాళీ కడుపుతో ఈ పండు తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
బొప్పాయి : బొప్పాయిని కొంతమంది పెరట్లో పెంచుకుంటారు. అలాగే మార్కెట్లో కూడా ఈ పండు విరివిగా లభ్యమవుతుంది. అయితే బొప్పాయిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, సోడియం, విటమిన్ సి, పొటాషియం వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకా.. కొలెస్ట్రాన్ని కూడా అదుపులో ఉంచుతాయి.
కివీ : కివీ పండు రుచిలో కాస్త పుల్లగా కొంచెం తియ్యగా ఉంటుంది. కివి పండు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు తగ్గడమే కాకా, హాట్ స్ట్రోక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు .