Papaya : బొప్పాయి చెట్టు చాలామంది పెరట్లో పెంచుకునే చెట్టు. ఇప్పుడు ఈ పండు మార్కెట్లో కూడా ఏ సీజన్లో అయినా లభిస్తూనే ఉంది. దీని వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం…ఈ పండు తినడం వల్ల ముఖ్యంగా శరీరంలో ఉన్న జీర్ణశక్తి సక్రమంగా పనిచేస్తుంది. ఈ పండు వల్ల చాలా లాభాలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ పండు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా యాంటీ ఏజింగ్ వంటి ప్రయోజనాలు చేకూరుతాయి.
అయితే బొప్పాయిని తిన్న తర్వాత తినకూడని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అవి తింటే మన శరీరం విషమయం అవుతుంది. అవేంటో తెలుసుకుందాం.. బొప్పాయిని తిన్న వెంటనే పాలపదార్థాలను అసలు తినకూడదు. ముఖ్యంగా పాలు, వెన్న, నెయ్యి, చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. బొప్పాయి లో ఉండే ఎంజైమ్ లు పాల పదార్థాలను జీర్ణం చేయలేయకపోగా… గ్యాస్ సమస్యలు రావడానికి కారణమవుతాయి
బొప్పాయిని తిన్న తర్వాత దోసకాయను అసలు తినకూడదు. ఎందుకంటే దోసకాయలో ఉండే నీటి శాతం కడుపులో పేరుకుపోతుంది. దానివల్ల విరోచనాలు, పొట్ట ఉబ్బరం, ఆపాన వాయు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. అలాగే బొప్పాయి తిన్న వెంటనే గుడ్లు తినడం వల్ల మలబద్ధకం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. బొప్పాయి తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లను తాగడం మంచిది. చల్లని నీరు తాగితే జీర్ణ క్రియ మందగిస్తుంది. బొప్పాయి తిన్న తర్వాత ఆమ్లా ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. దానివల్ల గుండెలో మంట, జీర్ణ సమస్యలు తలెత్తి అనారోగ సమస్యలు త్వరగా మన దరిచేరుతాయి.