Trivikram – Devi Sri Prasad : ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకి ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా రిపీటెడ్ గా ఆ క్రేజీ కాంబోలనే ఇష్టపడతారు. అలాంటి ఆదిరిపోయే కాంబినెషన్లలో ఒకటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి వంటి అద్భుతమైన ఆల్బమ్స్ వచ్చాయి. అలాంటి మంచి మ్యూజికల్ ఆల్బమ్స్ ఇచ్చిన దేవిని మళ్ళీ త్రివిక్రమ్ రిపీట్ చేయడం లేదు ఎందుకు అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది.
ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి సినిమాకి అనిరుధ్ ని.. అరవింద సమేత మూవీకి తమన్ ని అలాగే
అలవైకుంఠపురంలో కి కూడా తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు. ప్రస్తుతం SSMB 28 కి కూడా తమన్ నే మ్యూజిక్ అందించనున్నాడు. అయితే త్రివిక్రమ్ మూవీస్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని దూరం పెట్టడానికి బలమైన కారణాలు ఉన్నాయట.
గతంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ మ్యూజిక్ ఇవ్వడంలో అలాగే ఆర్ఆర్ సమయంలో దేవిశ్రీప్రసాద్, త్రివిక్రమ్ కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయట. ఇద్దరు కూడా ఈగోలకు చిన్న గొడవ కాస్త పెద్దగా మారిందట. అప్పుడు అల్లు అరవింద్ స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరి మధ్య గొడవ సర్దుమనిగేలా చేసి ఆ మూవీని కంప్లీట్ అయ్యేలా చూసాడట.
ఆ తర్వాత ఇంకా ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవ్వలేదు. కొంతకాలంగా తన రేంజ్ కి తగ్గ మ్యూజిక్ ఇవ్వడంలో దేవి విఫలమయ్యాడు. అయితే ఇటీవల వచ్చిన పుష్ప, వాల్తేరు వీరయ్యతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయితే దేవి ఫ్యాన్స్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రం వీరి కాంబోని గట్టిగా కోరుకుంటున్నారు. చూడాలి మళ్లీ వీరి కాంబినేషన్ ఎప్పుడు రిపీట్ అవుతుందో..
Discussion about this post