వినాయక చవితి పండుగ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో పండగ లాంటి న్యూస్ చెప్పాడు రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ. సెప్టెంబర్ రెండవ వారం నుంచి రాధేశ్యామ్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. లాంగెస్ట్ అండ్ లవ్లీఎస్ట్ షెడ్యూల్ విత్ డార్లింగ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ తో అభిమానులు ఖుషీ అవుతున్నారు. చిత్ర యూనిట్ లాక్ డౌన్ కు ముందు జార్జియాలో భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తర్వాత కరోనా కారణంగా గా షూటింగ్ వాయిదా వేశారు. ఇప్పటికే దాదాపు సగం సినిమా పైన పూర్తయిందని సమాచారం. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుట్టబొమ్మ పూజా హెగ్డే తొలిసారిగా ప్రభాస్ తో కలిసి నటిస్తోంది.
బాహుబలి తరువాత ప్రభాస్ తను చేసే ప్రతీ సినిమాని పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ చేసేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే రాధేశ్యామ్ సినిమా కి కూడా భారీ హైప్ వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
All excited to resume the shoot from 2nd week of September, the longest and the loveliest schedule with our darling #prabhas and @hegdepooja @UV_Creations @UVKrishnamRaju @itsBhushanKumar #RadheShyam
— Radha Krishna Kumar (@director_radhaa) August 22, 2020