2018 movie : ఆస్కార్ అవార్డుల కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో జూడ్ ఆంథోనీ జోసెఫ్ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత భావోద్వేగ భరితంగా తీర్చిదిద్దిన సినిమా.
కేరళలో చుక్క నీరు లేని సమయంలో 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి అనే డ్యామ్ను తెరవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఇక అదే టైమ్లో కేరళను వరదలు ముంచెత్తుతాయి. ఆ వరదల వల్ల ఎంతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వం ప్రజలను కాపాడేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రజలు ఆ వరదలతో ఎలా పోరాడారు అనే అంశాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు.
రియల్ గా జరిగిన ఈ సంఘటనలను తీసుకొని సర్వైవల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ వరదలు వచ్చినప్పుడు సామాన్య మానవులు హీరోలుగా మారి తమని తాము రక్షించుకుంటూనే, తోచినంతమందికి ఎలా సాయం చేశారు అనే కథాంశంతో తెరకేకించారు. కేవలం వరదలు మీద మాత్రం కాక అంతర్లీనంగా ప్రేమ, గొడవలు, త్యాగాలు ఇలా ఒక్కో క్యారెక్టర్ కి ఇంకో కథ పెట్టి దాన్ని కూడా అందంగా చూపించారు.జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో టోవినో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాల మురళి ప్రధాన పాత్రల్లో నటించారు.