SSMB 28 : అల వైకుంఠపురంలో మూవీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న సినిమా SSMB 28. సూపర్ స్టార్ మహేష్ బాబు.. పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ మూవీ షూటింగ్ గత కొద్ది రోజులుగా శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో జరుగుతుంది.
అయితే తాజాగా SSMB28 మూవీ సెట్స్ నుంచి ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ బ్రేక్ టైమ్లో సరదాగా ఇతర టీమ్ మెంబర్స్ తో కలిసి డైరెక్టర్ త్రివిక్రమ్ క్రికెట్ ఆడుతున్నారు(Director Trivikram plays cricket on SSMB 28 set). ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. కాగా ఈ వీడియోలో మనం రంగస్థలం మహేష్ ను కూడా చూడవచ్చు.
Also Read: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..?
మొత్తం అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి సెండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న SSMB 28 త్వరలో మూడో షెడ్యూల్ ను ప్రారంభించనుంది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Director Of #SSMB28 😍@urstrulymahesh #maheshbabu pic.twitter.com/nJx51M7Cnt
— SSMB (@SSMBHERE) February 1, 2023